JAGAN: సింగయ్య కేసులో ఏ2 వైఎస్ జగన్

JAGAN: సింగయ్య కేసులో ఏ2 వైఎస్ జగన్
X
సింగయ్య కేసులో కీలక మలుపు.. జగన్ వాహనం కిందే పడి మృతి!

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ మాజీ ము­ఖ్య­మం­త్రి వై­ఎ­స్ జగ­న్‌­మో­హ­న్ రె­డ్డి పల్నా­డు పర్య­ట­న­లో తీ­వ్ర వి­షా­దం చో­టు­చే­సు­కుం­ది. కా­న్వా­య్‌­లో­ని ఒక వా­హ­నం కింద పడి స్థా­నిక వృ­ద్ధు­డు మద్ది­లే­టి సిం­గ­య్య (65) మృతి చెం­దిన ఘటన రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా కల­క­లం రే­పు­తోం­ది. ఘట­న­కు సం­బం­ధిం­చి డ్రై­వ­ర్ రమ­ణా­రె­డ్డి­ని పో­లీ­సు­లు అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు. ఆయ­న్ను ఈ కే­సు­లో మొ­ద­టి నిం­ది­తు­డి­గా (A1) పే­ర్కొ­న­గా, సీఎం జగ­న్‌­ను రెం­డో నిం­ది­తు­డి­గా (A2), వాహన యజ­మా­ని­ని మూడో నిం­ది­తు­డి­గా (A3) ఎఫ్‌­ఐ­ఆ­ర్‌­లో చే­ర్చే అవ­కా­శ­ముం­ద­ని సమా­చా­రం.

సింగయ్య కేసులో ఏ2 వైఎస్ జగన్జగన్‌పై కేసు

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో జరిగిన ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి చనిపోయారు. ఈ కేసులో వైఎస్ జగన్‌ను నిందితుడిగా చేర్చినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. మరోవైపు సింగయ్య మృతిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు., " జూన్ 18న వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించారు. వైఎస్ జగన్ పర్యటన సమ­యం­లో గుం­టూ­రు­లో­ని ఏటు­కూ­రు రో­డ్డు­లో ఒక ప్ర­మా­దం జరి­గిం­ది. రో­డ్డు పక్కన తీ­వ్ర గా­యా­ల­తో ఒక వృ­ద్ధు­డు పడి ఉన్నా­డు. అత­న్ని ఆసు­ప­త్రి­కి తర­లిం­చ­గా, అప్ప­టి­కే చని­పో­యా­డ­ని డా­క్ట­ర్లు చె­ప్పా­రు. డ్రో­న్ వీ­డి­యో­లు, సీసీ టీవీ ఫు­టే­జీ­లు పరి­శీ­లిం­చాం. అలా­గే అక్కడ ఉన్న­వా­రు తీ­సిన వీ­డి­యో­ల­ను కూడా పరి­శీ­లిం­చాం. మాజీ సీఎం వై­ఎ­స్ జగన్ కారు కింద సిం­గ­య్య పడి­న­ట్టు వీ­డి­యో­లో ఉంది" అని ఎస్పీ తె­లి­పా­రు. వీ­డి­యో­ల­ను, ఇతర ఆధా­రా­ల­ను పరి­శీ­లిం­చాక కేసు నమో­దు చే­శా­మ­న్నా­రు.

విడదల రజినీపైన కూడా...

మరో­వై­పు ఈ కే­సు­లో వై­ఎ­స్ జగ­న్‌­తో పా­టు­గా కారు డ్రై­వ­ర్ రమ­ణా­రె­డ్డి, నా­గే­శ్వ­ర్‌­రె­డ్డి, సు­బ్బా­రె­డ్డి, పే­ర్ని నాని, వి­డ­దల రజ­ని­పై కేసు నమో­దు చే­శా­రు. వై­ఎ­స్ జగ­న్‌ పల్నా­డు పర్య­ట­న­కు 14 వా­హ­నా­ల­కు మా­త్ర­మే అను­మ­తి ఇచ్చి­న­ట్లు గుం­టూ­రు ఎస్పీ తె­లి­పా­రు. కానీ తా­డే­ప­ల్లి నుం­చి కా­న్వా­య్‌ మొ­ద­లై­న­ప్పు­డు 50 వా­హ­నా­ల్లో వచ్చా­ర­ని వె­ల్ల­డిం­చా­రు. రెంటపాళ్లలో జగన్‌ పర్యటనకు సంబంధించిన వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

వైఎస్ షర్మిల ఆగ్రహం

ఈ సం­ఘ­ట­న­పై జగన్ సో­ద­రి వై­ఎ­స్ షర్మిల సో­ష­ల్ మీ­డి­యా వే­ది­క­గా తీ­వ్రం­గా స్పం­దిం­చా­రు. “కారు కింద ఎవరో పడి­న­ట్టు తె­లి­సి­నా.. ఒం­టి­మీద సోయి లే­కుం­డా కా­న్వా­య్‌­ను ముం­దు­కు పో­ని­చ్చిన జగ­న్‌­కు బా­ధ్య­తా భావం ఉందా?” అంటూ ప్ర­శ్నిం­చా­రు. “బె­ట్టిం­గ్‌­లో ఓడి­పో­యిన వ్య­క్తి వి­గ్ర­హా­వి­ష్క­రణ కోసం ఇద్ద­రి­ని బలి చే­స్తా­రా? ప్ర­జల ప్రా­ణా­ల­తో శవ­రా­జ­కీ­యా­లు చే­స్తా­రా?” అని ఆగ్ర­హం­తో వ్యా­ఖ్యా­నిం­చా­రు. ప్ర­జల ప్రా­ణా­ల­కం­టే రా­జ­కీయ షోకే పె­ద్ద పీట వే­య­డ­మా? అంటూ వి­రు­చు­కు­ప­డ్డా­రు.

జగన్‌కు తెలియదని స్పష్టం

వైసీపీ ప్రకటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఈ ప్రమాదం జరిగిన విషయమే తెలియదని వివరించింది. “జగన్ తన పర్యటనలో పాల్గొంటుండగా, గాలంలో ప్రజలు అధికంగా ఉండటం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన అనంతరం జరిగిన తలగడపై టీడీపీ చేసిన విమర్శలు దురుద్దేశపూరితమైనవే. ఈ విషయంలో తప్పుదారి పట్టించే ప్రయత్నాన్ని ప్రజలు గుర్తించగలరు” అని వైసీపీ తెలిపింది. సంఘటనపై విచారణ జరిగి బాధ్యులకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా వైసీపీ సూచించింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి చెందిన వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గతేడాది మృతి చెందారు. కూటమి నేతల వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.

Tags

Next Story