YS Jagan : ఈవీఎంల పనితీరుపై మరోసారి జగన్ అనుమానాలు

YS Jagan : ఈవీఎంల పనితీరుపై మరోసారి జగన్ అనుమానాలు
X

రాజ్యాంగానికి ఆమోదముద్ర పడ్డ చరిత్రాత్మక ఘట్టానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. మన రాజ్యాంగం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుందన్నారు. అలాంటి ప్రాముఖ్యత కల్గిన రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలన్నారు. ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అని తెలిపారు. ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందన్నారు.వీటి పనితీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతున్నాయని ట్వీట్ చేశారు. అలాంటప్పుడు మనం కూడా బ్యాలెట్ వైపు ఎందుకు వెళ్లకూడదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు జగన్. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాదు.. ఉన్నట్టుగా కూడా కనబడాలన్నారు. అందరి ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్ర్యం కొంతకాలంగా అణచివేయబడుతోందని చెప్పారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సహా రాజ్యాంగాన్ని రూపొందించిన మన దార్శనిక నాయకులు సమానత్వం వైపు నడిపించారని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌లో తెలిపారు.

Tags

Next Story