YS Jagan : ఇండియా కూటమిలోకి జగన్.. ఇది మరో ఉదాహరణ

X
By - Manikanta |23 Aug 2024 11:15 AM IST
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాంగ్రెస్ కూటమిలో చేరుతారనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ దిశగా అడుగులు వేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ కూడా ఖండించలేదు. తాజాగా మరో కీలక పరిణామం జరిగింది.
మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు వైఎస్ జగన్. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ముస్లిం మైనారిటీలతో సమావేశమైన జగన్.. కేంద్ర ప్రభుత్వ బిల్లుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తాజా ప్రకటనతో ఆయన బీజేపీకి బైబై చెప్పినట్లేనని తెలుస్తోంది.
కాంగ్రెస్ కూటమిలో చేరాలని నిర్ణయించుకోడం వల్లే మోడీ సర్కార్ తీసుకోచ్చిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకించారని చెబుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com