LOKESH: జగన్ కడుపు మంట పెరిగింది: లోకేశ్

తల్లికి వందనం సూపర్ సక్సెస్ అవ్వటంతో తల్లుల కళ్లలో ఆనందం చూసి జగన్ రెడ్డి కడుపు మంట మూడింతలు పెరిగిందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారని మండిపడ్డారు. ఆరుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లులు, అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదని వెల్లడించారు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయన్నారు. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం జగన్ రెడ్డి బ్రాండ్ అని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలే అందరూ చేస్తారనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం.. చెయ్యనివ్వమని స్పష్టం చేశారు. జగన్ రెడ్డికి కడుపు మంటగా ఉన్నట్టుంది.. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి.. కాస్త తగ్గుతుందని ఎద్దేవా చేశారు. తల్లికి వందనంతో కుటుంబంలో ఎందరు చదువుకునే విద్యార్థులు ఉంటే వారందరికీ నగదు జమ చేస్తున్నట్లు లోకేశ్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com