MAHANADU: మహానాడు గ్రాండ్ సక్సెస్.. టీడీపీలో ఫుల్ జోష్

కడప గడపలో నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహానాడు సూపర్ సక్సెస్ అంటున్న టీడీపీ శ్రేణులు మంచి జోష్తో తిరుగుపయనమయ్యారు. మూడు రోజుల పాటు సాగిన సభలో భవిష్యత్ కార్యాచరణపై టీడీపీ అధిష్టానం శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. టీడీపీ పెట్టిన తర్వాత తొలిసారి కడపలో నిర్వహించిన మహానాడు సూపర్ సక్సెస్ అని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మహానాడులతో పోలిస్తే కడప మహానాడు బెస్ట్ అని ఘంటాపథంగా చెబుతున్నారు.
కడపలో మహానాడు ఎనౌన్స్ చేసినప్పటి నుంచి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన తెలుగుదేశం అధిష్టానం కొన్ని కీలకమైన మార్పులను ఈసారి తీసుకొచ్చింది. సాధారణంగా మహానాడు అంటేనే నేతల ప్రసంగాలతో నిండిపోతుంది. అధినేత దృష్టిలో పడాలని ప్రతీ నాయకుడూ వారిని పొగడ్తలతో ముంచుతూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఈసారి ఆర్గనైజర్స్ అలాంటి వాటికి చెక్ పెట్టారు. అధినేత చంద్రబాబు సహా వక్తలందరూ మహానాడు ఎజెండాకు మాత్రమే కట్టుబడి ఉన్నారు. ఈసారి మహానాడు ఆర్గనైజింగ్ కమిటీల్లో ప్రధాన పాత్ర వహించింది ఎక్కువ శాతం యువకులే. ముఖ్యంగా లోకేష్ టీం ఈసారి ఆర్గనైజింగ్ బాధ్యతలు వహించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com