AP : సౌదీలో చిక్కుకుపోయిన యువకుడిని స్వదేశానికి రప్పించిన మంత్రి

ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లి తీవ్ర సంక్షోభంలో చిక్కుకుకుపోయిన ధర్మవరం యువకుడు సయ్యద్ ఫరూక్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ సహకారంతో సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ ఉదంతం మంత్రి గారి మానవతా దృక్పథాన్ని, బాధితుల పట్ల ఆయన స్పందనను ప్రతిబింబిస్తోంది. పుట్టపర్తికి చెందిన ఓ ప్రైవేట్ ఏజెంట్ ద్వారా డ్రైవర్ ఉద్యోగం కోసం నమ్మి సౌదీకి వెళ్లిన ఫరూక్ అక్కడ బలవంతపు గృహ పనులు చేయించడమేగాక, ఆహారం, నివాసం లేకపోవడంతో పాటు జీతాలివ్వక పోవడంతో నరకయాతన అనుభవించారు. వెట్టి చాకిరీ చేయించడంతో తీవ్ర మానసిక, శారీరక వేదనకు గురయ్యాడు.
ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబుకు ఫరూక్ వీడియో కాల్ చేసి తన బాధను వెలిబుచ్చుకున్నాడు. వెంటనే స్పందించిన హరీష్ బాబు, ఈ విషయం రాష్ట్ర మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. మానవతా ధృక్పథంతో స్పందించిన మంత్రి, తక్షణమే కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శ్రీ కీర్తివర్ధన్ సింగ్ గారికి లేఖ రాశారు. ఆ లేఖలో మూడు ప్రధాన అంశాలను ప్రస్తావించారు:
1. ఫరూక్ కు ప్రాణ రక్షణ కల్పించాలి,
2. అతని పాస్పోర్టును తిరిగి అందజేయాలి,
3. భారత రాయబార కార్యాలయం ద్వారా స్వదేశానికి వచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలి.
ఈ చర్యల ఫలితంగా ఫరూక్ జూన్ 22న భారత్కు తిరిగిరాగా, జూన్ 23న ధర్మవరం లోని మంత్రి శ్రీ సత్యకుమార్ కార్యాలయానికి వచ్చి కార్యాలయ సిబ్బందిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ తో ఫోన్ లో మాట్లాడిన ఫరూక్, మంత్రిగారి సహకారం లేకపోతే నేను స్వదేశానికి తిరిగి వచ్చేవాడినే కాదని, నన్ను రక్షించి కుటుంబ సభ్యులదరికి చేర్చిన మంత్రి గారు దేవుడిలాంటి వారన్నారు. బీజేపీ నాయకులు ఎంతగా సామాన్యుల పట్ల బాధ్యతాయుతంగా ఉంటారో చాటిచెబుతుందన్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన నా పట్ల తక్షణం స్పందించిన మంత్రి దృష్టికి తీసుకెళ్లడంలో హరీష్ బాబు తీసుకున్న చొరవ,వెంటనే కేంద్రానికి లేఖ రాసి మంత్రి గారు స్పందించిన తీరు, ప్రభుత్వ స్థాయిలో జరిగిన సమన్వయం ప్రశంసనీయమని ఫరూక్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారతీయుల భద్రత కోసం బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ నిలబడి ఉంటుందన్నదానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యమని ఫరూక్ తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com