జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతోనే ఎన్టీఆర్ టిడిపి పార్టీలో వారికి సమాన హక్కులు కల్పించారని బాలయ్య స్పష్టంచేశారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఏంచేసిందో ప్రశ్నించాలని నటుడు, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా హిందూపురంలో చివరి రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు తీసేస్తామని బెదరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు కట్టే పన్నుల ద్వారానే పథకాలు అందిస్తున్నారని.. ఎవడబ్బ సొమ్ము కాదని వైసీపీ నేతలను నిలదీయాలన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. అంతకుముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సమక్షంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతోనే తన తండ్రి ఎన్టీఆర్ టిడిపి పార్టీలో వారికి సమాన హక్కులు కల్పించారని బాలయ్య స్పష్టంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story