వైసీపీ పద్ధతి మారకుంటే ప్రజలే బుద్ధి చెప్తారు : ఎంపీ కేశినేని

X
By - /TV5 Digital Team |2 Nov 2021 3:46 PM IST
రాష్ట్ర సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ప్రతిపక్ష నేతలపై వైసీపీ వాళ్లు దాడులు చేస్తున్నారన్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. టీడీపీ స్థాపించి ఇన్నేళ్లవుతున్నా ఏనాడూ హద్దు మీరలేదన్నారు.
రాష్ట్ర సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ప్రతిపక్ష నేతలపై వైసీపీ వాళ్లు దాడులు చేస్తున్నారన్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. టీడీపీ స్థాపించి ఇన్నేళ్లవుతున్నా ఏనాడూ హద్దు మీరలేదన్నారు. ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు..... ఏనాడైనా అసభ్య పదజాలం వాడారా అని ప్రశ్నించారు. వైసీపీ లీడర్లు పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. సంస్కృతి, నాగరికత లేని పార్టీ వైసీపీ అన్నారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్. దాడులు చేస్తూనే వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవడం సిగ్గు చేటన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com