క్రిస్టియన్లకు లేని కరోనా నిబంధనలు ఇతర మతాలకు ఎందుకు : ఎంపీ రఘురామ
By - /TV5 Digital Team |6 Sep 2021 2:15 PM GMT
క్రీస్టియన్లకు లేని కరోనా నిబంధనలు ఇతర మతాలకు ఎందుకని ప్రశ్నించారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.
క్రీస్టియన్లకు లేని కరోనా నిబంధనలు ఇతర మతాలకు ఎందుకని ప్రశ్నించారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. చర్చల్లో ప్రార్థనలకు అనుమతించారని... అక్కడ రాదా కరోనా అంటూ జగన్ సర్కార్ను నిలదీశారు. ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులందరూ ఆరాధించే గణేషుడి పూజలకు అడ్డంకులు ఎందుకంటూ ప్రశ్నించారు. జయంతి, వర్ధంతి సభలకు, చర్చిలు, మసీదులు, వైన్ షాపులకు లేని కరోనా... ఆదిదైవం గణపతికి ఎందకని ప్రభుత్వంపై మందిపడ్డారు. నిబంధనలు పెట్టి... పండుగల జరుపుకునేందుకు అనుమతించాలని కోరారు. ఇక మూడేళ్లలో బ్రహ్మాండమైన రాజధానిని కడతామని... రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామంటూ ఎన్నికల సమయంలో అమరావతిలో జగన్ ప్రసంగం వీడియోను ప్రదర్శించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com