మైదుకూరులో వైసీపీ వ్యూహం.. టీడీపీకి చేజారిన ఛైర్మన్ పీఠం

మైదుకూరులో వైసీపీ వ్యూహం.. టీడీపీకి చేజారిన ఛైర్మన్ పీఠం
పక్కా వ్యూహంతో వ్యవహరించిన వైసీపీ ఛైర్మన్‌పీఠం దక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

మైదుకూరులో ఊహించిందే జరిగింది. పక్కా వ్యూహంతో వ్యవహరించిన వైసీపీ ఛైర్మన్‌పీఠం దక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇవాళ్టి సమావేశానికి టీడీపీ 6వ వార్డు కౌన్సిలర్, జనసేన కౌన్సిలర్ దూరంగా ఉన్నారు.ఆఖరు నిమిషంలో ఇద్దరు గైర్హాజరు కావడంతో లెక్కలు మారిపోయాయి.

మైదుకూరులో మొత్తం 24 వార్డులుండగా... టీడీపీ 12, వైసీపీ 11, జనసేన-1 చొప్పున గెలిచాయి.. అయితే టీడీపీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ గైర్హాజరుతో ప్రస్తుతం టీడీపీ బలం 11కు పడిపోయింది.

టీడీపీకి మద్దతు ఇస్తారనుకున్న జనసేన అభ్యర్థి కూడా గైర్హాజరయ్యారు. అటు ఇద్దరు ఎక్స్అఫీషియో ఓట్లతో కలుపుకుంటే వైసీపీ బలం 13కు పెరిగింది. దీంతో ఛైర్మన్ పీఠం వైసీపీ వశమవుతోంది. అయితే వైసీపీ నేతలు టీడీపీ 6వ వార్డు కౌన్సిలర్ తోపాటు.. జనసేన కౌన్సిలర్‌ను ప్రలోభాలకు గురిచేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story