NADYALA: దళిత కుటుంబంపై దౌర్జన్యం..

NADYALA: దళిత కుటుంబంపై దౌర్జన్యం..
నంద్యాల వైసీపీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి అనుచరులు ఓ దళిత కుటుంబంపై దౌర్జన్యానికి దిగారు.

నంద్యాల వైసీపీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి అనుచరులు ఓ దళిత కుటుంబంపై దౌర్జన్యానికి దిగారు.ఎంపీ భూమిని కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు దళిత వర్గానికి చెందిన శేషన్న, అంకాలమ్మ దంపతులు. అయితే ఎంపీ బంధువు రవికుమార్ రెడ్డి, అతని అనుచరులు వారికి కౌలుకిచ్చిన భూమిలో మొక్కజొన్న పంటను ట్రాక్టర్ తో దున్నేశారు.పంటను నాశనం చేయడాన్ని అంకాలమ్మ అడ్డుకోవడంతో ఆమెను కులం పేరుతో దూషించిన ఎంపీ అనుచరులు దానితో ఆగకుండా ఆమెపై దాడి చేశారు.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అంకాలమ్మను నంద్యాల ఆసుపత్రికి తరలించారు.ఎంపీ అనుచరుల దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఏడాదికి లక్ష రూపాయలు కౌలు చెల్లించి వ్యవసాయం చేస్తున్నామని అయినా పంటను నాశనం చేశారంటూ అంకాలమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story