Nara Lokesh : టీడీపీ హయాంలో వచ్చిన పెట్టుబడులన్నీ వెనక్కు వెళ్లిపోయాయి..!

ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి.. వేలాది నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారన్నారు నారా లోకేష్. దొడ్డిదారిలో తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి చేసిన కుట్రలు బయటపడ్డాయన్నారు. ఎన్నికల ముందు జాబు రెడ్డిగా ఉంటానని హామీ ఇచ్చి ఇప్పుడు డాబు రెడ్డిగా మారారని, గ్రూప్-1, గ్రూప్-2లో 36 పోస్టులు మాత్రమే ఇచ్చి జగన్ రికార్డ్ సృష్టించారని కామెంట్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను పర్మినెంట్ చేసి 51 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను వైసీపీ కార్యకర్తలతో నింపేశారన్నారు లోకేష్. టీడీపీ హయాంలో వచ్చిన పెట్టుబడులన్నీ వెనక్కు వెళ్లిపోయాయని, ఏపీలో ఏర్పాటు చేయాల్సిన కంపెనీలను వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేసుకున్నారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com