Lokesh on Jagan : అద్భుతాలు చేస్తాడనుకుంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు : లోకేష్

Lokesh on Jagan : ఎన్నికలకు ముందు అబద్ధాలు చెబుతూ జగన్ రాష్ట్రంలో పాదయాత్ర చేశారని.. అద్భుతాలు చేస్తాడనుకుంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు.. చంద్రబాబు నిరసన దీక్షలో ప్రసంగించిన లోకేష్.. వైసీపీ సర్కార్పై విమర్శలతో విరుచుకుపడ్డారు.. నాడు చంద్రబాబు ఒక చిటికె వేసుంటే జగన్ పాదయాత్ర చేసుండేవారా అని ప్రశ్నించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా టీడీపీ కార్యకర్తలను ఆపలేరన్నారు లోకేష్.
పోలీసులు లేకుండా బయటకు రావాలంటూ దీక్షా వేదికగా వైసీపీ కార్యకర్తలకు సవాల్ విసిరారు లోకేష్.. బయటికొస్తే మా సత్తా ఏంటో చూపిస్తామన్నారు.. కొంతమంది పిల్లులు పులులు అనుకుంటున్నారని.. పిల్లులు కాబట్టే టీడీపీ కార్యకర్తల్ని హౌస్ అరెస్టులు చేశారని లోకేష్ ఎద్దేవా చేశారు.
అటు విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేయడం మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. ప్లేస్ ఎక్కడో చెప్తే మా వాళ్లు వస్తారన్నారు.. అక్కడే తేల్చుకుందామని సవాల్ విసిరారు.. జగన్ను సంతోషపెట్టడం కోసం, ఎమ్మెల్సీ పదవుల కోసం కొంతమంది నేతలు రౌడీయిజం, గూండాయిజం చేస్తున్నారని మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com