Nara Lokesh: 139వ రోజుకు చేరిన యువగళం పాదయాత్ర

Nara Lokesh: 139వ రోజుకు చేరిన యువగళం పాదయాత్ర
యువగళం పాదయాత్రలో మరో రికార్డు సృష్టించారు లోకేష్‌. నిన్న 1800 కి.మీ.ల మైలుదాయి అధిగమించారు.

లోకేష్‌ యువగళం పాదయాత్రం ఇవాల్టితో 139వ రోజుకు చేరింది. యువగళం పాదయాత్రలో మరో రికార్డు సృష్టించారు లోకేష్‌. నిన్న 1800 కి.మీ.ల మైలుదాయి అధిగమించారు. గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం అరవపాలెం వద్ద ఈ మజిలీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా 1800 కిలోమీటర్ల శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. ఇప్పటివరకు మొత్తం దూరం 1806 కిలోమీటర్లు పూర్తి చేశారు. లోకేష్‌కు ఘన స్వాగతం లభిస్తోంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

మరోవైపు సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్య తీరుపై నిప్పులు చెరిగారు నారా లోకేష్. 63వేల మెజార్టీతో గెలిచిపించిన ప్రజలు గాలికొదిలేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ గంజాయి అమ్ముకుంటు న్నాడంటూ ఆరోపించారు. కోర్టులో కేసులో బిజీగా ఉన్న దొంగ మంత్రి కాకాణి అంటూ ఎద్దేవా చేశారు. రైతులు ఆనందంగా ఉండాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్నారు‌.

అధికారంలోకి రాగానే రైతులను అన్నీ విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు‌.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూసార పరీక్షలు నిర్వహించి రైతులను ఆదుకున్నట్లు గుర్తుచేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాను విస్మరించాడని ఫైర్ అయ్యారు.

సైకో జగన్‌ సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయడం లేదన్నారు.ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి తాము చెప్పుకోలేక పోయామని.. ఏ సంక్షేమం చేయలేకపోయినా వైసీపీ పబ్లిసిటీ చేసుకుందని చెప్పారు. పాదయాత్రలో ప్రజలు కష్టాలు చూసా కన్నీళ్లు తుడిచే బాధ్యత తనదేన్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ముద్దులు పెట్టి మోసం చేశాడంటూ ఫైర్ అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story