దిశ చట్టం నిద్రపోతుందా జగన్ రెడ్డి గారు : లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం నిద్రపోతుందా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్... సీఎం జగన్ను ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 9 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురయిందని అన్నారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన మృగాడు సత్యనారాయణ రెడ్డిని కఠినంగా శిక్షించాల్సింది పోయి, స్థానిక వైసీపీ నేతలు రాజీ కుదిర్చే ప్రయత్నం చేయడం దారుణం అని మండిపడ్డారు. చిన్నారి పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు అసలు రక్షణ ఉందా అని ప్రశ్నించారు. 21 రోజుల్లో న్యాయం ఎక్కడ అని నిలదీశారు. ప్రచార ఆర్భాటంతో మొదటి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన జిల్లాలోనే ఘోరాలు జరుగుతుంటే... ఇక మిగిలిన చోట్ల ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్ధమవుతోందని ట్విట్టర్లో లోకేశ్ విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com