Narendra Modi: అనంతపురం రోడ్డు ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి.. మరణించిన వారికి రూ. 2లక్షలు..
Narendra Modi: అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. PMMRF నిధుల కింద పరిహారం అందజేస్తామన్నారు. అటు గాయాలైన వారికీ మెరుగైన చికిత్స అందించాలని మోదీ కోరారు.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లిబృందం సభ్యులతో వెళుతున్న ఇన్నోవా కారును లారీ ఢీకొనడంతో 9 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఉరవకొండ మండలం బూదగవి వద్ద ఈ ప్రమాదం జరిగింది.
కర్ణాటకలోని బళ్లారిలో జరిగే వివాహానికి హాజరై తిరిగి అనంతపురం వెళుతుండగా.. ఈ ఘోరం జరిగింది. మృతులంతా ఉరవకొండ మండలం నిమ్మగల్లు వాసులుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఇన్నోవా కారు డ్రైవర్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతులంతా ఒకే కుటుంబానికిచెందిన వారుగా గుర్తించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com