Pawan Kalyan: 'ముఖ్యమంత్రివి అయితే దిగొచ్చావా.. కొమ్ములుంటాయా'.. జగన్పై పవన్ వ్యాఖ్యలు

Pawan Kalyan: జగన్... వైసీపీ ముఖ్యమంత్రి తప్ప.. ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహించడంలేదంటూ మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పద్యం పుట్టిన నేలలో మద్యం ఏరులై పారుతోందని నిప్పులు చెరిగారు. కడప జిల్లా సిద్ధవటంలో పర్యటించిన ఆయన.. 175 మంది కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. కౌలు రైతులకు ఇవ్వడం లేదన్నారు. కడప జిల్లాలో అత్యధికంగా రెడ్లే బాధితులుగా ఉన్నారని అన్నారు.
ఇక వైసీపీ నేతలు తనకు కుల రాజకీయాలు ఆపాదిస్తున్నారని పవన్ ఫైర్ అయ్యారు. ఒక కులానికి సేనగా అభివర్ణించడం సరికాదన్నారు. తన అయ్యన్న పెట్టిన పార్టీని.. జాతీయ పార్టీలో విలీనం చేయించింది ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రులేనన్నారు. ఆ పార్టీ కనుక ఇప్పుడుంటే.. ఏపీలో ఇలాంటి పరిస్థితి వచ్చేకాదన్నారు. తన ప్రాణాలు పోయినా పర్వాలేదని.. మార్పు మాత్రం రావాలన్నారు పవన్ కళ్యాణ్.
ముఖ్యమంత్రివి అయితే దిగొచ్చావా.. కొమ్ములుంటాయా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవన్ కల్యాణ్. ఎంతకాలం జగన్ కు భయపడతామని ప్రశ్నించారు. చిరంజీవితో కూడా జగన్ దండం పెట్టించుకున్నారని.. తన కుటుంబంలోని వ్యక్తిని కూడా జగన్ చేతులు పట్టుకునేలా చేశారని నిప్పులు చెరిగారు. చేతులు కట్టుకుని జగన్ ముందు నిలబడేలా చేశారని దుయ్యబట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com