AP Minister Narayana : చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లు: మంత్రి నారాయణ

రాష్ట్రంలో చైనా తరహా విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. ఈ ప్లాంట్లు చెత్త ఆధారంగా పనిచేస్తాయని చెప్పారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మూడేళ్లలో రాజధాని అమరావతి పనులు పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం నిధులను దారి మళ్లించింది. విపరీతంగా పన్నులు పెంచి ప్రజలను దోపిడీ చేసింది. తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నాం’ అని ఆయన తెలిపారు.
మరోవైపు 2014-19 మధ్య చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అప్పటి టీడీపీ సర్కారు నిర్ణయించింది. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి పాలవ్వటంతో ఆ దిశగా బలంగా అడుగులు పడలేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల పల్నాడు జిల్లాలో పర్యటించిన మంత్రి నారాయణ.. ఏపీలో త్వరలోనే చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లు నెలకొల్పనున్నట్లు చెప్పారు. త్వరలోనే కాకినాడ, నెల్లూరులో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి చెత్త మీద పన్ను వేయడం తప్ప.. చెత్తను ఎలా నిర్వహించాలో తెలియదన్న నారాయణ.. తాము అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్ ద్వారా పారిశుధ్యంతో పాటుగా విద్యుత్ కూడా కలిసొస్తుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com