Raghu Rama Krishna Raju: నా హత్యకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది-ఎంపీ రఘురామ
By - Divya Reddy |15 April 2022 1:30 PM GMT
Raghu Rama Krishna Raju: తన హత్యకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆరోపించారు.
Raghu Rama Krishna Raju: తన హత్యకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. రామకృష్ణారెడ్డి అనే అధికారి తన ఇంటి ముందు తచ్చాడటం పట్ల డీజీపీకి లేఖరాసినా స్పందన లేదన్నారు. దీనిపై విచారణ జరపాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లు తెలిపారు. అమ్మ ఒడి పథకానికి విద్యుత్ వాడకాన్ని లింక్ పెట్టడం దివాళాకోరు రాజకీయంగా రాఘురామ దుయ్యబట్టారు. రేషన్ బియ్యం అవసరం లేకుంటే నగదు ఇస్తామని మంత్రి పేర్కొనడాన్ని తప్పుపట్టారు. ఆహారభద్రత పథకం కేంద్రానిదని, దానికి మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కేలేదన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com