సంక్షేమం కోసం అప్పులు చేస్తున్నామని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు : ఎంపీ రఘురామ
X
By - TV5 Digital Team |31 March 2021 5:00 PM IST
సంక్షేమం కోసం అప్పులు చేస్తున్నామని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు.
సంక్షేమం కోసం అప్పులు చేస్తున్నామని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఢిల్లీలో రచ్చబండ సందర్భంగా ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. సంపద సృష్టించాల్సిన ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రాన్ని నట్టేట ముంచుతోందని విమర్శించారు. ప్రభుత్వం కొత్త కొత్త స్కీమ్లు తీసుకొస్తోందని, అయితే, అవన్నీ ప్రజలకు మేలు చేసేవి కాదని, ఎవరి మేలు చేసేవో అందరికీ తెలుసంటూ సెటైర్లు వేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రఘురామకృష్ణరాజు తీవ్రంగా తప్పుపట్టారు.. ఈ నిర్ణయం వెనుక పెద్ద స్కామ్ ఉందంటూ ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com