AP : షర్మిలది టైంపాస్ రాజకీయం... రోజా మళ్లీ దింపిందిగా..!

AP : షర్మిలది టైంపాస్ రాజకీయం... రోజా మళ్లీ దింపిందిగా..!

నవ్యాంధ్రను తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నట్టేట ముంచారని మండిపడ్డారు మంత్రి రోజా. ఆంధ్ర యూనివర్సిటీ జూబ్లీ గ్రౌండ్లో జరుగుతున్న ఆడుదాo ఆంధ్ర ..కబడ్డీ పోటీలను మంత్రి రోజా పాల్గొన్నారు. కబడ్డీ ఆడి ఎంజాయ్ చేశారు. ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయడం.. విమర్శలు చేయడం తప్ప ఇంకేం చేస్తున్నాయని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ లబ్ది కోసం గతంలో కాంగ్రెస్‌తో, ఇప్పుడు బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నాడని రోజా విమర్శించారు. బాబు, లోకేష్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

పవన్ కల్యాణ్ మాటలు పదేళ్లుగా బోర్ కొట్టడంతో.. వైఎస్ షర్మిలను చంద్రబాబు రంగంలోకి దించారని విమర్శించారు రోజా. తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఇప్పుడు ఏపీలో టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి షర్మిల వచ్చిందని రోజా సెటైర్లు వేశారు. చంద్రబాబు స్క్రిప్ట్ ను షర్మిల చదువుతున్నారని ఫైరయ్యారు.

తనపై కౌంటర్ ఇచ్చిన షర్మిలను విమర్శలతో ఎన్ కౌంటర్ చేశారు రోజా. వైఎస్సార్ పంచెలూడదీసి కొడతానన్న పవన్ కల్యాణ్ ఇంటికి షర్మిల వెళ్లి పెళ్లికి ఆహ్వానించిందని గుర్తుచేశారు. వినే వాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పే వాడు షర్మిల అన్నట్లుగా పరిస్థితి ఉందన్నారు రోజా. వైఎస్ ట్యాగ్ లేకపోతే షర్మిలను చూసేవాడు ఎవరూ ఉండరని చురకలు అంటించారు.

Tags

Read MoreRead Less
Next Story