కేంద్రం నిధులతోనే ఏపీ ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తోంది : సోము వీర్రాజు

X
By - Nagesh Swarna |11 Jan 2021 3:29 PM IST
రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టి.. అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టారని విమర్శించారు సోము వీర్రాజు.
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టి.. అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టారని విమర్శించారు. ఏపీని సర్వనాశనం చేస్తున్నారని వైసీపీ నేతల్ని ప్రజలు తరిమికొట్టాలని అన్నారు. అవినీతి, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాలు వైసీపీ నేతల దినచర్య అని ధ్వజమెత్తారు. కేంద్రం నిధులతోనే ఏపీ ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తోందని చెప్పారు. అభివృద్ధి తమదే-ఓటు అడిగే హక్కు తమదే అని సోము వీర్రాజు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com