జగన్కు తెలిసే మత మార్పిళ్లు జరుగుతున్నాయి: సునీల్ దేవదర్

X
By - TV5 Digital Team |10 April 2021 3:53 PM IST
ఏపీ సీఎం జగన్కు తెలిసే... అన్యమత ప్రచారం, మత మార్పిళ్లు జరుగుతున్నాయని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవదర్ విమర్శించారు.
ఏపీ సీఎం జగన్కు తెలిసే... అన్యమత ప్రచారం, మత మార్పిళ్లు జరుగుతున్నాయని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవదర్ విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది క్రైస్తవ మతాన్ని స్వీకరించారని తెలిపారు. హోంమంత్రి సుచరిత, తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి క్రిస్టియన్లే అని అన్నారు. చర్చి ఫాస్టర్లకు ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు. మత మార్పిళ్ల కోసమే ఫాస్టర్లకు డబ్బులు ఇస్తున్నారా అని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com