COVID-19 Death : విశాఖలో కరోనాతో ఒకరు మృతి?

విశాఖ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 64 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. అయితే ఇదే విషయంపై జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం నిబంధనల మేరకు ప్రభుత్వం సూచించిన వైరాలజీ ల్యాబ్ కు చికిత్స పొందుతున్న కరోనా రోగి శాంపిల్స్ రాలేదని, ఆర్టీపీసీఆర్ పరీక్ష పాజిటివ్ రావాలని చెబుతున్నారు. మరో వైపు చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు మాత్రం ఆయా రోగికి న్యూమోనియా లక్షణాలు ఉండటంతో కోవిడ్ పరీక్షను ప్రైవేట్ గా జరిపామని, ఆయా పరీక్షల్లో కరోనాగా తేలిందని చెబుతుండటం విశేషం.
నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం 64 ఏళ్ల వ్యక్తి బీపీ, షుగర్, న్యూమోనియా వ్యాధి లక్షణాలతో చేరారని, ఆయనకు కరోనా పరీక్ష చేస్తే పాజిటివ్ వచ్చిందని విశాఖ జిల్లా డీఎం హెచ్ వో డాక్టర్ పి.జగదీశ్వర రావు చెప్పారు. దీంతో ఆయా ఆస్పత్రి వైద్యులు కరోనా మరణంగా పేర్కొన్నారని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com