TDP: ప్రకాశించని నవరత్నాలు..జగన్ మోసపు లీలలు..

జగన్ నవరత్నాలపై టీడీపీ పుస్తకం విడుదల చేసింది. ప్రకాశించని నవరత్నాలు-జగన్ మోసపు లీలలు పేరుతో టీడీపీ నేతలు బుక్ను రిలీజ్ చేశారు. మాట తప్పడమే కాదు మడమ తిప్పిన జగన్ అంటూ అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య నిప్పులు చెరిగారు. పాలనలో రివర్స్ గేర్ పలుకుల్లోనూ రివర్స్ గేర్ అంటూ ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో 99శాతం హామీలు అమలు చేశారనడం అవాస్తవమన్నారు.
ఏపీలో పేదవాడికి సరైన వైద్యం అందుతుందా అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అమ్మఒడి కింద 15వేలు ఇస్తామని 13వేలే ఇచ్చారంటూ ఆరోపించారు. 84 లక్షల మంది విద్యార్థులు ఉంటే 42 లక్షల మందికే అమ్మఒడి ఇచ్చారంటూ తీవ్ర విమర్శలు చేశారు.సీఎం జగన్ పాలనపై వర్ల రామయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద ఇచ్చిన 8 హామీలు అమలు కాలేదన్నారు. పేదలకు ఇళ్ల పేరిట ఇచ్చిన 5 హామీలు అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. మద్యనిషేధమన్న హామీ ఏమైందంటూ నిలదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com