వైసీపీ నేతలు 5వేలు పెట్టైనా ఓట్లు కొంటారు : చంద్రబాబు

వైసీపీ నేతలు 5వేలు పెట్టైనా ఓట్లు కొంటారు : చంద్రబాబు
రాష్ట్రంలో జగన్‌ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తానంటున్నారని.. బుద్ధి వచ్చేలా తిరుపతి ప్రజలు తీర్పు ఇవ్వాలని అన్నారు.

అరాచక పాలన అంతానికి తొలి అడుగు తిరుపతి నుంచే మొదలవ్వాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సూళ్లూరుపేటలో నిర్వహించిన రోడ్‌షోలో.. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని రక్షించేందుకు తమ్ముళ్లు, చెల్లెళ్లు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో పనబాక లక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించి వైసీపీ అరాచక పాలన అంతానికి తొలి అడుగు వేయాలన్నారు.

వైసీపీ నేతలు 5వేలు పెట్టైనా ఓట్లు కొంటారని ఆరోపించారు చంద్రబాబు. రాష్ట్రంలో జగన్‌ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తానంటున్నారని.. బుద్ధి వచ్చేలా తిరుపతి ప్రజలు తీర్పు ఇవ్వాలని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అథోగతిపాలైందన్నారు. నాడు ముద్దులు పెట్టి.. ఇప్పుడు ప్రజల్ని గుద్దుకుంటూ వస్తున్నాడంటూ జగన్‌పై ఫైర్‌ అయ్యారు చంద్రబాబు. ఇక ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇవాళ వెంకటగిరిలో పర్యటించనున్నారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story