Chandrababu: ఈ నెల 30న కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు

Chandrababu: ఈ నెల 30న కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు
Chandrababu: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రేపు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించబోతున్నారు.

Chandrababu: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రేపు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించబోతున్నారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ... చంద్రబాబు పర్యటనపై అందరి దృష్టిపడింది. ఈ టూర్ ను చాలా సీరియస్ గా తీసుకున్నారు చంద్రబాబు.

తమ్ముళ్ల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిస్కరిస్తూనే.. నియోజకవర్గంవ్యాప్తంగా పర్యటన కొనసాగనుంది. 29న కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకోనున్న చంద్రబాబు.. బస్టాండ్ ఆవరణలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మొదటి రోజు పలు పార్టీ కార్యక్రమాల్లో బిజి బిజిగా గడపనున్నారు.

ఇక ఈ నెల 30న కుప్పం పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తారు చంద్రబాబు. కుప్పంలో గ్రామస్థాయి నుంచి టీడీపీ కేడర్‌ను బలోపేతం చేసేందుకు ఈ పర్యటన చేస్తున్నట్లు తెలుస్తంది. పార్టీ పటిష్టత కోసం తన సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టిన చంద్రబాబు.... పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపడమే లక్ష్యంగా ఈ పర్యటన ఉంటుందంటున్నారు పార్టీ నేతలు.

కుప్పంకు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లోనే బస చేసే వారు. కానీ ఈ పర్యటనలో ఆయన బస్సులోనే బసచేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాయకులతో సమావేశాలను మాత్రం అతిథి గృహంలో నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story