మే డే సందర్భంగా కార్మికులకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు

మే డే సందర్భంగా కార్మికులకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు
అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం ఆవిర్భవించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం ఆవిర్భవించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా ఆయన కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రన్న బీమాతో 2.50 కోట్ల మంది కార్మికులకు భరోసా కల్పించామని చంద్రబాబు తెలిపారు. కార్మికులు ఆకలితో ఉండకూడదని అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. వైసీపీ అనాలోచిత విధానాలతో కార్మికులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. కరోనా సమయంలో కార్మికులకు టీకాలు, మందులు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని చంద్రబాబు అన్నారు.

కరోనా ఉధృతి వేళ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై మరోసారి చంద్రబాబు మండిపడ్డారు. ఇంతటి కొవిడ్ ప్రమాదంలోను పరీక్షలు పెడతామనడం బాధాకరమన్నారు. ఎన్నో కుటుంబాలు కరోనా బారిన పడే ప్రమాదముందనే ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న కరోనా మరణాలు జగన్ హత్యగా భావించాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తుందన్న చంద్రబాబు.. ఎవరైనా మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story