Ap Assembly : అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీఎల్పీ నిర్ణయం
By - TV5 Digital Team |5 March 2022 3:30 PM GMT
Ap Assembly : ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని టీడీపీ నిర్ణయించింది.
Ap Assembly : ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని టీడీపీ నిర్ణయించింది. చంద్రబాబు మినహా టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సభకు హాజరుకావాలని టీడీఎల్పీ నిర్ణయించింది. జగన్ సర్కార్ వైఫల్యాలను సభలో లేవనెత్తాలని టీడీపీ నిర్ణయించింది. అలాగే అమరావతిని అభివృద్ధి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం, నిర్వాసితులకు పరిహారం అందించడంలో విఫలంపైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ప్రజా సమస్యలు వివరించేందుకే ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించామని టీడీపీ శాసనసభాపక్ష నేత అచ్చెన్నాయుడు తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com