చంద్రబాబుపై రాళ్ల దాడిని నిరసిస్తూ కడపలో టీడీపీ నేతల నిరాహార దీక్ష..!
By - TV5 Digital Team |13 April 2021 10:00 AM GMT
నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహిస్తున్న సందర్భంలో వైసీపీ రౌడీ మూకలు దాడి చేయడం హేయమైన చర్య అని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సి సుధాకర్ మండిపడ్డారు.
తిరుపతి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహిస్తున్న సందర్భంలో వైసీపీ రౌడీ మూకలు దాడి చేయడం హేయమైన చర్య అని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సి సుధాకర్ మండిపడ్డారు. దాడి సంఘటన నిరసనగా పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలను రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలు అధిక ధరలతో బాధపడుతున్నారని, వైసీపీ నేతలు రాష్ట్ర ఖజానా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని, మద్యపానం నిషేధిస్తే మని చెప్పి అధిక ధరలకు ప్రజలకే అమ్మడం దుర్మార్గమైన చర్య అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com