ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే : పిల్లి సత్తిబాబు
By - TV5 Digital Team |6 Feb 2021 1:34 PM GMT
మనస్తాపంతో పార్టీ పదవులకు రాజీనామా చేశాను తప్ప.. ప్రాణం ఉన్నంత వరకు టీడీపీ పార్టీలో కొనసాగుతా అన్నారు మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్తిబాబు.
మనస్తాపంతో పార్టీ పదవులకు రాజీనామా చేశాను తప్ప.. ప్రాణం ఉన్నంత వరకు టీడీపీ పార్టీలో కొనసాగుతా అన్నారు మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్తిబాబు. కాకినాడలోని యనమల రామకృష్ణుడుతోపాటు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణరెడ్డి, వర్మలు సమావేశమై పిల్లి అనంతలక్ష్మి, పిల్లిసత్తిబాబును బుజ్జగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పరోక్ష వేధింపులు ఎక్కువయ్యాయని, పలు చోట్ల పోటీచేయకుండా అధికార పార్టీనేతలు అడ్డుకుంటున్నారని సత్తిబాబు వారికి వివరించారు. పార్టీని ముందుకు తీసుక పోవడంలో విఫలం అయ్యారని అధిష్టానానికి చినరాజప్ప ఫిర్యాదు చేయడంతోనే రాజీనామా చేసినట్లు వివరించారు. పార్టీలోనే కొనసాగుతూ.. పార్టీకి సేవ చేస్తానన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com