TDP Leaders : కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన టీడీపీ నేతలు..!

TDP (tv5news.in)

TDP (tv5news.in)

TDP Leaders : రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అధికార పార్టీ చేస్తున్న దాడులు, కామెంట్లను ఈసీకి వివరించారు నేతలు.

YSRCP గుర్తింపు రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు తెలుగు దేశం పార్టీ నేతలు. ఈ మేరకు ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అధికార పార్టీ చేస్తున్న దాడులు, కామెంట్లను ఈసీకి వివరించారు నేతలు. గంజాయి సహా రాష్ట్రంలోని సమస్యలను ప్రస్తావిస్తే అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వైసీపీ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని ఈసీ హామీ ఇచ్చిందన్నారు తెలుగుదేశం నేతలు.

Tags

Read MoreRead Less
Next Story