పెట్రోల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు
నెల్లూరు జిల్లావ్యాప్తంగాపెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా బాపట్లలో నిరసనలు మిన్నంటాయి. గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా క్లాక్ టవర్ దగ్గర ఎద్దులబండి, బైకులతో నిరసన తెలిపారు. కావలిలో తాడుతో ఆటోని లాగి నిరసన తెలిపారు. ధరలు దిగిరావాలి, జగన్ దిగిపోవాలి అనే నినాదంతో ఆందోళన చేపట్టారు. ఆత్మకూరులో బస్టాండ్ నుంచి సోమశిల రోడ్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. నెల్లూరు నగరంలో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో వీఆర్సీ జంక్షన్ నుంచి గాంధీ బొమ్మ వరకు టీడీపీ నేతలు ర్యాలీ జరిగింది. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com