పోలీస్స్టేషన్ ఎదుట టీడీపీ నేతల ఆందోళన

X
By - Bhoopathi |23 Jun 2023 11:00 AM IST
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని తాళభద్రలో ఇవాళ టీడీపీ తలపెట్టిన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్స్టేషన్ ఎదుట అర్థరాత్రి టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని తాళభద్రలో ఇవాళ టీడీపీ తలపెట్టిన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పోలీస్స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. టీడీపీ కార్యక్రమానికి అనుమతి కోరుతూ నాలుగు రోజుల క్రితం దరఖాస్తు చేసుకుంటే మంత్రి అప్పలరాజు పర్యటన ఉందని చెప్పి ఎలా రిజెక్ట్ చేస్తారని గౌతుశిరీష ప్రశ్నించారు. టీడీపీ కార్యక్రమం జరగకూడదన్న కుట్రతోనే మంత్రి ఈ విధంగా వ్యవహరించారని శిరీష ఆరోపించారు. పోలీసులు కూడా ప్రజాప్రతినిధులకు వంత పాడుతున్నారని మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com