TDP: జగన్‌కి షాక్..టీడీపీలోకి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు

TDP: జగన్‌కి షాక్..టీడీపీలోకి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు
X
వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు.. కళ్యాణ చక్రవర్తి, పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ రాజీనామా... చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు

వై­సీ­పీ అధి­నేత జగ­న్‌­కు మరో బిగ్ షాక్ తగి­లిం­ది. వై­ఎ­స్ఆ­ర్ కాం­గ్రె­స్ పా­ర్టీ నుం­చి ము­గ్గు­రు ఎమ్మె­ల్సీ­లు తె­లు­గు­దే­శం పా­ర్టీ లో చే­రా­రు.. ము­ఖ్య­మం­త్రి, టీ­డీ­పీ అధి­నేత చం­ద్ర­బా­బు సమ­క్షం­లో ఈ ము­గ్గు­రు నే­త­లు టీ­డీ­పీ కం­డు­వా కప్పు­కు­న్నా­రు. వై­సీ­పీ­లో­ని పద­వు­లు, ఎమ్మె­ల్సీ స్థా­నా­ల­కు ఈ ము­గ్గు­రు నే­త­లు ఇప్ప­టి­కే రా­జీ­నా­మా­లు సమ­ర్పిం­చా­రు. కానీ మం­డ­లి చై­ర్మ­న్ ఇంకా వీరి రా­జీ­నా­మా­ల­ను ఆమో­దిం­చ­లే­దు. వీ­రం­తా ఇప్ప­టి­కే వై­సీ­పీ­కి, ఎమ్మె­ల్సీ పద­వు­ల­కు గుడ్ బై చె­ప్పే­శా­రు. అయి­తే టీ­డీ­పీ­లో చే­రిక మా­త్రం ఆల­స్య­మైం­ది. వీరు పా­ర్టీ­లో చే­రేం­దు­కు టీ­డీ­పీ గ్రీ­న్ సి­గ్న­ల్ ఇచ్చిం­ది. దీం­తో చం­ద్ర­బా­బు సమ­క్షం­లో ము­గ్గు­రు ఎమ్మె­ల్సీ­లు పసు­పు కం­డు­వా కప్పు­కు­న్నా­రు. గతం­లో వై­సీ­పీ తర­ఫున ఎమ్మె­ల్సీ­లు అయిన మర్రి రా­జ­శే­ఖ­ర్, బల్లి కళ్యా­ణ్ చక్ర­వ­ర్తి, కర్రి పద్మ­శ్రీ వి­విధ కా­ర­ణా­ల­తో ఆ పా­ర్టీ­ని వీ­డా­రు. జగన్ వై­ఖ­రి నచ్చ­లే­ద­ని ఒకరు, పా­ర్టీ­లో ఇమ­డ­లే­క­పో­తు­న్న­ట్లు మరో ఇద్ద­రు ప్ర­క­టిం­చా­రు. అయి­తే వీరు ముం­దు­గా­నే టీ­డీ­పీ పె­ద్ద­ల­తో మా­ట్లా­డు­కు­ని ఆ పా­ర్టీ­లో చే­రారు. ఎమ్మె­ల్సీ పద­వు­లు కూడా వదు­లు­కు­న్నా­రు. ఈ కా­ర్య­క్ర­మం­లో టీ­డీ­పీ రా­ష్ట్ర అధ్య­క్షు­డు పల్లా శ్రీ­ని­వా­స­రా­వు, ఎంపీ లావు శ్రీ­కృ­ష్ణ­దే­వ­రా­య­లు, పలు­వు­రు ఎమ్మె­ల్యే­లు, ఎమ్మె­ల్సీ­లు హా­జ­ర­య్యా­రు. ఎమ్మె­ల్యే­లు సు­నీ­ల్, వి­జ­య­శ్రీ, పు­లి­వ­ర్తి నా­ని­తో పాటు ఎమ్మె­ల్సీ­లు పే­రా­బ­త్తుల రా­జ­శే­ఖ­ర్, అను­రాధ పా­ల్గొ­న్నా­రు. ఈ ము­గ్గు­రు ఎమ్మె­ల్సీ­ల­లో బల్లి కల్యా­ణ్ చక్ర­వ­ర్తి పద­వీ­కా­లం 2027 వరకు ఉం­డ­గా... మర్రి రా­జ­శే­ఖ­ర్, పద్మ­శ్రీ పద­వీ­కా­లం 2029 వరకు ఉంది.

మర్రి రాజశేఖర్ కీలక వ్యాఖ్యలు

సీఎం నారా చం­ద్ర­బా­బు నా­యు­డు చే­ప­డు­తు­న్న అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మాల పట్ల ఆక­ర్షి­తు­లై టీ­డీ­పీ­లో చే­రి­న­ట్లు ఎమ్మె­ల్సీ మర్రి రా­జ­శే­ఖ­ర్ అన్నా­రు. ఆరు నెలల కిం­దట తమ పద­వు­ల­కు రా­జీ­నా­మా­లు చే­స్తే.. శా­స­న­మం­డ­లి ఛై­ర్మ­న్ ఇంకా రా­జీ­నా­మా­లు ఆమో­దిం­చ­డం లే­ద­ని చె­ప్పా­రు. మం­డ­లి ఛై­ర్మ­న్ వె­నుక ఉండి నడి­పిం­చే వారి వల్ల­నే తమ రా­జీ­నా­మా­ల­ను ఆమో­దిం­చ­కుం­డా కా­ల­యా­పన చే­స్తు­న్నా­రం­టూ మర్రి రా­జ­శే­ఖ­ర్ సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. రా­జీ­నా­మాల ఆమో­దం కోసం ఆరు నెలల పాటు ఎదు­రు చూ­శా­మ­ని.. ఆమో­ది­స్తా­ర­నే నమ్మ­కం లే­క­నే పా­ర్టీ­లో­కి చే­రి­న­ట్లు తె­లి­పా­రు. సో­మ­వా­రం నుం­చి మం­డ­లి­కి వె­ళ్తా­మ­ని.. ఏం చే­సు­కుం­టా­రో చే­సు­కోం­డం­టూ కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. ఉమ్మ­డి నె­ల్లూ­రు జి­ల్లా­లో బల్లి ఎమ్మె­ల్సీ బల్లి కళ్యా­ణ్ చక్ర­వ­ర్తి కు­టుం­బం కీ­ల­కం­గా వ్య­వ­హ­రిం­చే­ది. నె­ల్లూ­రు జి­ల్లా నా­యు­డు­పేట మం­డ­లం భీ­మ­వ­రం­కు చెం­దిన బల్లి దు­ర్గా­ప్ర­సా­ద్ టీ­డీ­పీ ద్వా­రా రా­జ­కీ­యా­ల్లో­కి వచ్చా­రు. ది­వం­గత ఎన్టీ­ఆ­ర్ ప్రో­త్సా­హం­తో 26 ఏళ్ల వయ­సు­లో­నే దు­ర్గా­ప్ర­సా­ద్‌ రా­జ­కీ­యా­ల్లో చే­రా­రు. గూ­డూ­రు ఎమ్మె­ల్యే­గా నా­లు­గు సా­ర్లు దు­ర్గా ప్ర­సా­ద్ ఎన్ని­క­య్యా­రు.

Tags

Next Story