AP : అసెంబ్లీలోనే మిగిలిన మూడు శ్వేతపత్రాలు

X
By - Manikanta |19 July 2024 12:01 PM IST
శ్వేతపత్రాల్లో మిగిలిన మూడింటిని అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనుంది. ఇసుక, విద్యుత్, పోలవరం-నీటిపారుదల రంగం, రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు. తద్వారా వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసాలను వీటి ద్వారా ప్రజలకు వెల్లడించారు.
వాస్తవానికి గురువారం శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉంది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడే మూడు శ్వేతపత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com