Rajolu : రాజోలులో దారుణం...మంచినీటి చెరువులో యువకుడి మృతదేహం

Rajolu : రాజోలులో దారుణం...మంచినీటి చెరువులో యువకుడి మృతదేహం
X

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో దారుణం చోటు చేసుకుంది. రాజోలు మండలం తాటిపాక RWS మంచినీటి చెరువులో లభ్యమైన స్థానిక యువకుడి మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అదే గ్రామానికి చెందిన గుమ్మడి కుమార్ స్వామి (27) గా గుర్తించారు. పోలీసులు. అయితే కుమారస్వామిది ఆత్మహత్య కాదని కొంతమంది దాడి చేసి కొనఊపిరితో ఉండగా చెరువులో పడేసారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. రాజోలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. తమ కుమారుడిని చంపేశారు అంటూ ఆందోళన చేపట్టారు బంధువులు. తమ కుమారున్ని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ప్రభుత్వాసుపత్రి ఎదురుగా నిరసన తెలిపారు. ఇద్దరు అనుమాతుల్ని అదుపులోకి తీసుకుని రాజోలు పోలీసులు విచారిస్తున్నారు. కుమార్ స్వామి మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజోలు పోలీసులు...

Tags

Next Story