Kurnool : ఇద్దరికి ఉరిశిక్ష.. కర్నూలు జడ్జి సంచలన తీర్పు

కర్నూలు (Kurnool) జిల్లా న్యాయమూర్తి సంచలన తీర్పు చెప్పారు. భార్యను, అత్తను హత్య చేసిన కేసులో శ్రవణ్ కుమార్ కు ఉరిశిక్ష విధించారు. జంట హత్యల కేసులో ఇద్దరికి ఉరిశిక్ష, ఒకరికి జీవిత ఖైదును విధిస్తూ కర్నూలు జిల్లా అదనపు జడ్జి తీర్పు చెప్పారు.
శ్రవణ్ కుమార్ ఈ హత్యలు చేయడానికి సహకరించిన తండ్రి వరప్రసాద్ కు కూడా ఉరిశిక్ష పడింది. తల్లి కృష్ణవేణికి యావజ్జీవం విధిస్తూ తీర్పు చెప్పింది. ఏడాదిలోపే విచారణ ముగించి ఈ సంచలన తీర్పు చెప్పారు న్యాయమూర్తి.
2023 మార్చిలో ఈ జంట హత్యలు కర్నూలు జిల్లాలో సంచలనం కలిగించాయి. పెళ్లయిన 14 రోజులకే భార్యపై అనుమానంతో భర్త శ్రవణ్ కుమార్ తన తల్లి, తండ్రి సహకారంతో అత్త, భార్యలను చంపేశారు. ఈ కేసులో విచారించిన న్యాయస్థానం ఈ సంచలన తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com