CM Chandrababu : ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పేదలందరికీ సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అందిస్తామని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపడానికి, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం వంటి కీలక అంశాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని పునరుద్ఘాటించారు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ వేడుకలో వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, విద్యార్థులు, పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు, పతాకావిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన చంద్రబాబు, వివిధ శకటాల ప్రదర్శనను తిలకించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com