Shocking News : వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతా వరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 5 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో ఏపీ సహా తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రుతుపవన ద్రోణి జైసల్మేర్, రైసేన్, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతంలోనున్న వాయు గుండం కేంద్రం గుండా పొరుగున ఉన్న తెలంగాణ, మచినీ పట్నం మీదుగా వెళ్తూ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగ్ ళాఖాతం వరకు వ్యాపించి ఉందని పేర్కొంది.
దీంతో.. మంగళశారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మ, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మ కొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వానలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్స్ జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణశాఖ తెలిపింది. అత్యధికంగా కామారెడ్డి, నిజా మాబాద్, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో 25.4, సదాశివనగర్ 24, నిజామాబాద్ జిల్లా తుంపల్లిలో 22.1 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com