AP Anganwadi Workers : అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి

అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. సోమవారం గణేష్ సర్కిల్ నుంచి భారీ ర్యాలీగా అంగన్వాడీలు తరలివచ్చారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని నినాదాలు ఇస్తూ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగనవాడి జిల్లా యూనియన్ కార్యదర్శి శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి జెడ్పి శ్రీనివాసులు, ఈఎస్ వెంకటేష్ మాట్లాడుతూ అంగన్వాడీలు అందరూ పేద కుటుంబాల వారని నెలకు వారికి 12000 లోపే గౌరవేతనం ప్రభుత్వం ఇస్తుందన్నారు. పేద గర్భిణీలకు బాలింతలకు చిన్న పిల్లలకు అంగనవాడీలు హెల్పర్లు మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారన్నారు. అయితే ప్రభుత్వ పథకాలైన తల్లికి వందనం రేషన్ కార్డులు పింఛన్లు పదవి విరమణ బెనిఫిట్స్ ఏవి అందడం లేదన్నారు. ఏమని అడిగితే అంగనవాడిలను ప్రభుత్వ ఉద్యోగుల కేటగిరిలో ఉండారు అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే అందుకు సరిపడా వేదనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా కూటమి నాయకులు అంగనవాడీల సమస్యలు పరిష్కరిస్తామని సరైన వేతనంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వర్ సరిగా పనిచేయందున ఫోన్లు సరిగా పనిచేయడం లేదని రోజు డేటా పంపాలి అంటే ఇబ్బందిగా ఉందని అందువల్ల ఎఫ్ ఆర్ ఎస్ ను రద్దు చేయాలని వేతనాలు పెంచాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా వ్యతిరేక విధానాలు ఇలాగే ఉంటే జులై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో లక్షలాది కార్మికులు స్కీమ్ వర్కర్లు పాల్గొని నిరసన తెలుపుతామని హెచ్చరించారు. అనంతరం డి ఆర్ ఓ విజయ సారధి కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అంగనవాడి వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మా బున్నీసా, జిల్లాలో 12 ప్రాజెక్టుల అధ్యక్ష కార్యదర్శులు, సిఐటియు జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, సాంబశివ, దిల్షాద్, పేడపల్లి బాబా, పైపల్లి గంగాద్రి, అంజి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com