Eluru: రచ్చబండలో ఆకస్తికర సన్నివేశం.. చంద్రబాబును సాయం కోరిన వైసీపీ నేత..

Eluru: రచ్చబండలో ఆకస్తికర సన్నివేశం.. చంద్రబాబును సాయం కోరిన వైసీపీ నేత..
Eluru: ఏలూరు జిల్లా నెక్కలం గొల్లగూడెంలో చంద్రబాబు నిర్వహించిన రచ్చబండ ఆకస్తికరమైన సన్నివేశం కనిపించింది.

Eluru: ఏలూరు జిల్లా నెక్కలం గొల్లగూడెంలో చంద్రబాబు నిర్వహించిన రచ్చబండ ఆకస్తికరమైన సన్నివేశం కనిపించింది. ఈ కార్యక్రమంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ ఓ వైసీపీ నేత కోరాడు. ఎమ్మెల్యే కుమారుడు అవినీతిపై పోరాడుతున్నానని చంద్రబాబు తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఐతే, వైసీపీకి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రాంబాబుకు మాట్లాడే అవకాశం ఇవ్వడంపై టీడీపీ వర్గీయులు అభ్యంతరం తెలిపారు.

వాళ్లను వారించిన చంద్రబాబు.. అవినీతిపై పోరాటం విషయంలో పార్టీలకు అతీతంగా అంతా పోరాడాలని పిలుపిచ్చారు. ఇళ్ల స్థలాల విషయంలో ఎమ్మెల్యే కుమారుడు 75 లక్షలు అవినీతి చేశారని దీనిపై తాను పార్టీలోనే ఉండి పోరాడుతున్నానని రాంబాబు చెప్పడంతో.. ఈ విషయంలో తనవంతుగా ఎలాంటి మద్దతు కావాలన్నా ఇస్తానని చంద్రబాబు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story