Bandi Sanjay : వైసీపీ పాలకులు వీరప్పన్ వారసులు : బండి సంజయ్

ఏపీలో గత వైసీపీ పాలకులు వీరప్పన్ వారసులు అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని అన్నారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ఎర్ర చందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారని, ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారని వ్యాఖ్యానించారు. గత అరాచక ప్రభుత్వంలో స్వామి వారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని, ఇప్పుడు స్వామి వారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందన్నారు. ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. శేషాచలం కొండల్లో ఎర్ర చందనం దోపిడీపై నివేదిక కోరుతామని, దాని ఆధారంగా జాతీయ సంపద దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్వామి వారి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ తెలిపారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com