LOKESH: 152వ రోజుకు చేరిన యువగళం పాదయాత్ర

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాల్టితో లోకేష్ పాదయాత్ర 152వ రోజుకు చేరింది.ఇప్పటి వరకు 1983 కిలోమీటర్లు నడిచిన లోకేష్ ప్రస్తుతం కావలి అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ తుమ్మలపెంట క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు.లోకేష్ కు అడుగడుగునా జనం హారతి పడుతున్నారు.ఆయనతో కరచాలనం చేసేందుకు సెల్సీలు దిగేందుకు పోటీలు పడుతున్నారు. లోకేష్ తన పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం మన్నంగిదిన్నె, కోనదిన్నెలో స్థానికులతో సమావేశమైన వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అనంతరం ఆముదాలగిన్నెలోనూ ప్రజలతో సమావేశమవుతారు. భోజన విరామం అనంతరం తిరిగి పాదయాత్ర కొనసాగిస్తారు. మధ్యాహ్నం కావలి అంబేద్కర్ నగర్ లో ఎస్సీలతో సమావేశవుతారు. అనంతరం కావలి పోలేరమ్మ గుడి వద్ద స్థానికులతో భేటీ అవుతారు. ఆ తర్వాత కావలి బీపీఎస్ సెంటర్ లో బహిరంగసభలో లోకేష్ ప్రసంగించనున్నారు. అనంతరం కావలి వలికుంటపురం సర్కిల్ లో స్థానికులతో సమావేశమవుతారు.ఇవాళ శ్రీపురం క్రాస్ వద్ద విడిది కేంద్రంలో లోకేష్ బస చేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com