Cements Price : పెరిగిన సిమెంట్ రేట్స్.. తెలుగు రాష్ట్రాల్లో రూ.20-30 పెంపు

X
By - Manikanta |4 Oct 2024 6:30 PM IST
తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు పెరిగాయి. సిమెంట్ ధరలను పెంచుతున్నట్లు ఉత్పత్తి సంస్థలు ప్రకటించాయి. అల్ట్రాటెక్, ఇండియా సిమెంట్స్, దాల్మియా భారత్, రామ్కో, ఏసీసీ, ఇండియా సిమెంట్స్ సహా ప్రధాన సిమెంట్ కంపెనీలు ధరలు పెంచాయి. ఏపీ, తెలంగాణలో 50 కేజీల సిమెంట్ బస్తాపై రూ.20-30 మేర ధర పెంచినట్లు సమాచారం. తమిళనాడులో రూ.10-20 పెంచినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ముడిసరుకులు, పెరుగుతున్న రవాణా ఖర్చుల్ని తగ్గించుకోవడంలో భాగంగా సిమెంట్ ఉత్పత్తి సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com