Gold Prices : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు .. తులం ఎంతంటే ?

ఇవాళబంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్నటి రేట్లతో పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 150 పెరిగింది. దీంతో ధర రూ. 60 వేల 250 కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 170 పెరగ్గా రూ. 65 వేల 730 కి విక్రయిస్తున్నారు. అలాగే నేడు వెండి ధరలపై రూ. 500 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 79 వేలుగా గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 65,880
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 60,250 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 65,730.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,250కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 65,730గా ఉంది. దేశంలో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 79,000గా ఉంది.
దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com