India : టూ వీలర్స్, కార్ల అమ్మకాల్లో జోష్

మే నెలలో దేశంలో బైకులు, టూ వీలర్లు, కార్ల అమ్మకాలు పెరిగాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ తయారీదారుల సంస్థ తెలిపిన వివరాల ప్రకారం మే నెలలో వాహన అమ్మకాలు స్థిరమైన పనితీరును కనబరిచాయి. ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర, త్రి చక్ర వాహనాలు, క్వాడ్రిసైకిళ్ల అమ్మకాలు మొత్తం 20,12,969 యూనిట్లుగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు ఎక్కువ అమ్మకాలను నమోదు చేశాయి. త్రిచక్ర వాహనాలు, క్వాడ్రిసైకిళ్ల అమ్మకాలు తగ్గాయి. స్కూటర్లు, మోటార్ సైకిళ్లు, మోపెడ్లతో సహా ద్విచక్ర వాహనాల అమ్మకాలు అంతకు ముందు సంవత్సరం మేనెలతో పోల్చితే 2.2 శాతం పెరిగాయి. ద్విచక్ర వాహనాల్లో స్కూటర్ల అమ్మకాలు 7.1 శాతం పెరిగి 5,79,507 యూనిట్లుగా ఉన్నాయి. మోటార్ సైకిల్ అమ్మకాలు మారలేదు. ఇవి 10,39,156 యూనిట్లుగా ఉన్నాయి. మోపెడ్ అమ్మకాలు 7.7 శాతం తగ్గి 37,264 యూనిట్లుగా ఉన్నాయి.
మూడు చక్రాల వాహనాల అమ్మకాలు 3.3 శాతం తగ్గి 53,942 యూనిట్లుగా ఉన్నాయని సైమా సోమవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. మొత్త ద్విచక్ర వాహనాలు 16,55,927 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. క్వాడ్రిసైకిల్ అమ్మకాలు 96.9 శాతం తగ్గాయి.
ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు స్వల్పంగా 0.8 శాతం తగ్గి 3,44,656 యూనిట్లుగా ఉన్నాయి.మే నెలోల అన్ని వాహనాల అమ్మకాలు 25,82,207 యూనిట్లుగా ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com