Recharge : రీఛార్జ్ ధరలు ఎందుకు పెరిగాయంటే?

జియోతో మొదలై ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు టారిఫ్లు పెంచడంతో యూజర్లకు రీఛార్జ్ భారంగా మారింది. యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకునేందుకే సంస్థలు టారిఫ్ను పెంచాయి. FY24 క్యూ4లో ఎయిర్టెల్ ARPU ₹209, జియో ₹181.7, Vi ₹146గా ఉంది. ఈ సగటు FY27కి ₹300కు పెంచుకోవాలని ఎయిర్టెల్ ఆశిస్తోంది. 5జీ సేవలను మానిటైజ్ చేసుకునేందుకు కూడా టారిఫ్లు పెంచుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీలన్నీ రీఛార్జ్ రేట్లను పెంచేశాయి. అత్యధికంగా జియో 27% టారిఫ్స్ పెంచింది. AirTel, వొడాఫోన్ ఐడియా సైతం కస్టమర్లకు షాక్ ఇచ్చాయి. దీంతో చాలా మంది ప్రభుత్వరంగ సంస్థ అయిన BSNLకు షిఫ్ట్ అవుతున్నట్లు పోస్టులు చేస్తున్నారు. మిగతా కంపెనీలతో పోలిస్తే BSNLలో రీఛార్జ్ ధరలు తక్కువ. అయితే BSNL 4G సేవలు ఆగస్టు నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. మరి మీది ఏ నెట్వర్కో కామెంట్ చేయండి.
వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు 10 నుంచి 21 శాతం పెరగనున్నాయి. ఈ పెంపు జులై 4 నుంచి అమల్లోకి వస్తుందని సంస్థ ప్రకటించింది. దీంతో రూ.179 రీఛార్జ్ ప్లాన్ రూ.199కి, రూ.269 ప్లాన్ రూ.299కి పెరగనుంది. ఇలా అన్ని ప్లాన్లపై ఛార్జీల పెంపు ఉండనుంది. ఇప్పటికే జియో, ఎయిర్టెల్ కంపెనీల టారిఫ్ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com