IPL : ఐపీఎల్ మ్యాచ్‌లపై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్

IPL : ఐపీఎల్ మ్యాచ్‌లపై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్

"ఐపీఎల్ మ్యాచ్‌లు రెండు రోజులు చూడకపోతే కొంపలేం మునిగిపోవు. ఫస్ట్, సెకండ్ షో సినిమాలను చూడడానికి ప్రేక్షకులంతా థియేటర్స్ కు రండి. క్రికెట్ స్కోర్ ను మీ ఫోన్లో అయినా చూడవచ్చు" అంటూ అనిల్ రావిపూడి రీసెంట్ గా ఓ ప్రమోషన్ ఈవెంట్ లో కామెంట్స్ చేశారు. అనిల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.

సత్యదేవ్ హీరోగా అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై వి.వి గోపాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కృష్ణమ్మ. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ ఏర్పడింది. ఇక ఈ సినిమా మే 10న ప్రేక్షకులు ముందుకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు మేకర్స్. ముఖ్య అతిథులుగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని హాజరై సందడి చేశారు. ఈ వేదికపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సత్యదేవ చిన్న చిన్న పాత్రలో కెరీర్‌ ప్రారంభించి హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడనీ.. ఏ కథకైనా, ఏ పాత్రకైనా ఆయన న్యాయం చేయగలడని అన్నారు అనిల్. ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలకు రాకపోవడంతో థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయని... ఐపీఎల్ రెండు రోజులు చూడకపోతే కొంపలేం మునిగిపోవని అనడంపై ట్రోలింగ్ జరుగుతోంది.

Tags

Next Story