Drushyam : హాలీవుడ్ లోకి దృశ్యం .. ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డ్

Drushyam : హాలీవుడ్ లోకి దృశ్యం ..  ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డ్

వెంకటేశ్, మీనా నటించిన దృశ్యం సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. తొలుత మళయాళంలో మోహన్ లాల్ హీరోగా రూపుదిద్దుకున్న ఈ సినిమా అనంతరం టాలీవుడ్ లో రీమేక్ అయింది. ఆ తరువాత హిందీలోనూ దీన్ని తెరకెక్కించారు. దృశ్య పేరుతో కన్నడలో, పాపనాశం టైటిల్ తో తమిళ్ లోనూ ఈ సినిమాను రీమేక్ చేశారు. ఇలా పలు భాషల్లో రూపుదిద్దుకుని అనేక రికార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది. దీనికి సీక్వెల్ గా రూపొందిన దృశ్యం 2 కూడా విజయవంతమైంది.

దీంతో ఈ సిరీస్ చిత్రాల కథలు కొరియన్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా మంచి హిట్ టాక్ వచ్చింది. కాగా రీమేక్ పరంగా మరో అరుదైన ఘనత దృశ్యం సినిమా సాధించింది. ఈ సారి ఏకంగా హాలీవుడ్ లోకే రీమేక్ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను ఇంగ్లీష్, స్పానిష్ లో రీమేక్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో హాలీవుడ్ లో రీమేక్ కానున్న మొదటి ఇండియన్ ఫిల్మ్ గా దృశ్యం నిలవనుంది.

హాలీవుడ్ లో ప్రసిద్ధి చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం కథలను హాలీవుడ్ ప్రేక్షకులకు అందించనుంది. పనోరమ స్టూడియోస్ నుంచి ఈ సినిమా అంతర్జాతీయ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. అయితే హాలీవుడ్ లో హీరో హీరోయిన్లుగా ఎవరు నటిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మలయాళంలో త్వరలోనే దృశ్యం 3 కూడా రానుంది.

Tags

Read MoreRead Less
Next Story